హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు కండ్లకు కట్టేలా వివరించాలని చెప్పారు. వేడుకల ఏర్పాట్లపై మంగళవారం ఆయన సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఆరోగ్యరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎదిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యతెలంగాణ ఆశయం నెరవేరే దశకు చేరుకున్నామని చెప్పారు. ప్రాథమిక నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రమించిందని గుర్తు చేశారు.
పర్యవేక్షణ బాధ్యతలు వీరికే..
ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించారు. హెల్త్సెక్రటరీ రిజ్వీకి నల్లగొండ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మ హంతికి మెదక్, ఆయుష్ కమిషనర్ ప్రశాంతికి మహబూబ్నగర్, డీఎంఈ రమేశ్రెడ్డికి వరంగల్, డీహెచ్ శ్రీనివాసకు ఆదిలాబాద్, టీవీవీపీ కమిషనర్ అజయ్కు నిజామాబాద్, సీఎం ఓఎస్డీ గంగాధర్కు కరీంనగర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షికి రంగారెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్రెడ్డికి హైదరాబాద్, ఈడీ కౌటిల్యకు ఖమ్మం జిల్లాల బాధ్యతలను మంత్రి అప్పగించారు.