Congress | కొడంగల్/ఆదిలాబాద్, డిసెంబరు 27: అధికారం లేని కాంగ్రెస్ నేతలు అధికారిక సమావేశాల్లో హల్చల్ చేశారు. ప్రజా పాలన కార్యక్రమంపై బుధవారం కొడంగల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఆదిలాబాద్లో కలెక్టర్ కార్యాలయంలో సన్నాహక సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ కూడా హాజరయ్యారు.