హైదరాబాద్ : శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు(Ugadi celebrations) తెలంగాణ భవన్లో(Telangana Bhavan) ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.