KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును టైకాన్ కేరళ-2024 సమ్మిట్ ఆహ్వానించింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో కోచీలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా 13వ ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ కాన్ఫరెన్స్ సమ్మిట్ జరుగనున్నది. ఈ సమ్మిట్కు వివిధ రంగాలకు చెందిన కంపెనీల సీఈవోలు, స్టార్టప్స్ వ్యవస్థాపకులు, పరిశ్రమల నిపుణులు వెయ్యిమందికిపైగా హాజరవనున్నారు. ‘మిషన్ 2030- ట్రాన్స్ఫార్మింగ్ కేరళ’ థీమ్తో సమ్మిట్ జరుగనున్నది. డిసెంబర్ 5న సాయంత్రం జరిగే సమ్మిట్ ముగింపు వేడుకలకు హాజరు కావాలని జాకబ్ జోయ్, టైకాన్ చైర్మన్ వివేక్ కృష్ణగోవింద్ కేటీఆర్కు ఆహ్వానం పలికారు.