ములుగు, మే 22 : విహారం కాస్తా విషాదంగా మారింది. ఈత సరదా రెండు జీవితాలను బలితీసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్లో ఆదివారం చోటుచేసుకుంది.
ఎస్ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన అక్షయ వెంకట్ (27), బోయిన్పల్లికి చెందిన రాజన్శర్మ (27), సికింద్రాబాద్కు చెందిన రుహెబ్ ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాగా, వీకెండ్ కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్కు ఆదివారం ఉదయం వచ్చారు.
అక్షయ వెంకట్, రాజన్శర్మలు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకన్న పోలీసులు మృతదేహాలను వెలకితీసి పోస్ట్మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.