సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జగదేవ్పూర్ మండలంలోని అలిరాజపేట్ బ్రిడ్జి వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..జగదేవ్పూర్కు చెందిన ప్రయాణికులు ఆటోలో జగదేవ్పూర్ నుంచి గజ్వేల్ కు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ శ్రీగిరిపల్లి కనకయ్య, కొటాల కవిత అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags – Telugu news Telangana news Crime news district news