న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం పులి గుంట సమీపంలోని అల్లాదుర్గం మేటల్ కుంట రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
హద్నూర్ ఎస్ఐ వినయ్ కుమార్ కథనం ప్రకారం.. కర్ణాటకలోని ముసృపల్లికి చెందిన రహీమ్ (38), మన్నన్(6) బైక్ పై మల్కపాడ్కు వస్తుండగా.. పులి గుంత సమీపంలో హద్నూర్ నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో రహీమ్ అక్కడికక్కడే మృతి చెందగా మన్నన్ ను దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.