ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకులాల్లో చదివే విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పటికే పలు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్పాయిజన్, పాము కాటులకు గురవుతుండగా.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్ధారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కరెంట్ షాక్కు గురయ్యారు.
గొల్లబుద్ధారం గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ప్రాంగణంలో ఇటీవల చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగాయి. పనివాళ్లతో వాటిని కొట్టించాల్సిన హాస్టల్ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆ చెట్ల కొమ్మలను కొట్టమని గురుకులంలో తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులను వార్డెన్ ఆదేశించారు. వార్డెన్ చెప్పడంతో ఇద్దరు విద్యార్థులు కొమ్మలను నరికారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు కరెంట్ వైర్కు తగిలి ఉండటంతో ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
కరెంట్ షాక్తో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు కరెంట్ షాక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్ల బుద్దారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు చెట్ల కొమ్మలు కొట్టమని చెప్పిన వార్డెన్
చెట్టు కొమ్మలు కొడుతుండగా కరెంట్ షాక్కు గురైన ఇద్దరు విద్యార్థులు
తీవ్ర గాయాలపాలైన… pic.twitter.com/g1gXp1x9qB
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2025