Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్ – అకోల రహదారిలో మామిడిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అరబిందో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు. మృతులను శ్రీకాకుళం చెందిన వారని పోలీసులు తెలిపారు.