భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజన వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ములకలపల్లి మండలం మాదారం అటవీప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
గిరిజనులు కూలీ పనులకు వెళ్తుండగా.. విద్యుత్ తీగలపై ఓ ఇద్దరు కాలు మోపారు. విద్యుత్ షాక్కు గురై ఆ ఇద్దరు మరణించారు. మృతులను మొగరాలకుప్పకు చెందిన పాయం జాన్బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.