మైలార్దేవ్పల్లి, జనవరి 27: కుటుంబ కలహాల కారణంగా తండ్రి, మామపై విచక్షణారహితంగా దాడి చేసి ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా కొట్టి చంపాడో దుండగుడు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. రాజేంద్రనగర్ సర్కిల్ బాబుల్రెడ్డినగర్లో లక్ష్మీనారాయణ (55)కుటుంబంతో జీవిస్తున్నాడు.
అతడి కుమారుడు రాకేశ్ (24) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల లక్ష్మీనారాయణ తన ఇంటిని అమ్మకానికి పెట్టగా, ఒక పార్టీ వచ్చి టోకెన్ డబ్బు చెల్లించింది. అప్పటి నుంచి ఇంట్లో తండ్రీకొడుకుల నడుమ తరచూ గోడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం మరోసారి గొడవ జరిగింది. ఈ సమయంలో ఆగ్రహంతో తండ్రి లక్ష్మీనారాయణపై రాకేశ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. వారించబోయిన మామ శ్రీనివాస్ (60)పైనా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ను ఉస్మానియాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందా రు.