కామారెడ్డి : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్లి వస్తూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్(Annaram Kalan) సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు బంధువుల వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో అన్నారం కలాన్ సమాపానికి రాగానే బైక్(Bike) అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచా రమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కిషన్ సవాయి సింగ్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.