హనుమకొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా(Hanumakonda district) హసన్పర్తి మండలం బాహుపేట క్రాస్రోడ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ధర్మసాగర్కు చెందిన సోమయ్య(55), సుదర్శన్(58) బైక్పై వెళ్తుండగా వీరి వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సోమయ్య, సుదర్శన్ మృతితో ధర్మసాగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.