హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రస్తుతం హైకోర్టులో 30 మంది న్యాయమూర్తులు సేవలందిస్తున్నారు. నూతన న్యాయమూర్తుల రాకతో వీరి సంఖ్య 32కు చేరుకొన్నది. ఈ నెల 10న వీరి పేర్లను కొలిజీయం సిఫారసు చేయగా, తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేసింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు
పాల్గొన్నారు.