హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం రెండు కొత్త మండలాలను ఏర్పాటుచేసింది. సాత్నాల, భోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ రూరల్ నుంచి రెండు గ్రామాలు, జైనథ్, భేల మండలాల నుంచి ఐదు చొప్పున గ్రామాలు.. మొత్తంగా 12 గ్రామాలతో సాత్నాల మండలాన్ని ఏర్పాటుచేసింది. జైనథ్ మండలం నుంచి 28 గ్రామాలను వేరుచేస్తూ భోరజ్ మండలాన్ని ఏర్పాటుచేసింది.