హైదరాబాద్ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Former MLA Shakeel) కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash driving)కేసులో పంజగుట్ట పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు విషయంలో నిందితులకు సహకరించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేని ఉదయం బోధన్(Bodhan)లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు. కాగా, ఇటీవల మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన సాహిల్ అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు.