ములుగు : తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోల కాల్పుల్లో జవాన్కు సైతం గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ – ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దులో ఉన్న కర్రెలగుట్ట సమీపంలో సాయుధ బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం.
ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్ట్ (సీపీఐ) ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యులకు, తెలంగాణ గ్రౌహౌండ్స్కు మధ్య బీజాపూర్ బార్డర్ ఏరియాలోని కర్రెలగుట్ట ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనలో ఇద్దరు మావోయిలు మృతి చెందగా.. ఇందులో ఒకరిని ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా కమిటీ సెక్రెటరీ సుధాకర్గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరాలేదు.