రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు. ప్రాణాలతోని బయటపడ్డా, అప్పు మాత్రం మిగిలింది. దాన్ని తీర్చే స్థోమత లేకపోవడంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం కోసం మా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారును కలిశాను. ఆయన వెంటనే స్పందించారు.
సీఎంఆర్ఎఫ్ పథకం కింద రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వాటితోని అప్పులు తీర్చాం. సీఎంఆర్ఎఫ్ పథకం నా కుటుంబాన్ని అప్పుల పాలుకాకుండా కాపాడింది.
– ఏనుగొండ బాల్రాజ్, సిద్ధోటం, నవాబ్పేట మండలం, మహబూబ్నగర్ జిల్లా