హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తూప్రాన్ మండలం ఘనపూర్ వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు వర్గల్ మండలం మాదాపూర్ వాసులుగా గుర్తించారు. మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.