Kamareddy Road Accident | కామారెడ్డి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై గర్గుల్ వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతులను బాన్సువాడ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మధుసూదన్రెడ్డి (47), మహోధర్రావు (45)గా గుర్తించారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ వెళ్లి బాన్సువాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. కరీంనగర్ నుంచి బాన్సువాడ వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.