Nizamabad | పండుగపూట నిజామాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆడుకుంటూ వెళ్లి భవనం నిర్మాణం కోసం తీసిన గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృత్యుఒడికి చేరారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన బాల్కొండ మండలం ఇత్వార్పేట గ్రామంలో గురువారం జరిగింది. వీడీసీ భవనం నిర్మాణం కోసం గుంతలు తీశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిండింది. శరణ్ (4), నాస్తిక్ (5) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడిపోయారు. నీటిలో మునగడంతో ప్రాణాలు కోల్పోయారు. పండగపూట ఇద్దరు చిన్నారులు ఆటుకుంటూ వెళ్లి నీటిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది.