IPS Transfers | తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ నియామకమయ్యారు. అలాగే రాచకొండ జాయింట్ కమిషనర్ అడ్మిన్గా అంబర్ కిశోర్ ఝాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఆర్ శ్రీనివాస్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అంబర్ కిశోర్ హోంగార్డ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా పని చేస్తున్నారు. ఇద్దరిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.