వికారాబాద్: జిల్లాలోని తాండూరు (Tandur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సంగం కలాన్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ వద్ద రోడ్డు పక్కన నిలబడిన వారిని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రెండు ప్రమాదాలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.