మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు. జెల్ల సరిత తన భర్త, కుమార్తెతో కలిసి పోలం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కు గురవడంతో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. భర్త జెల్ల సమ్మయ్య పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.