హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్లో రోడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమలాపూర్ మండలంలోని శనిగరం శివారులో లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు మృతులను కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.