నిర్మల్/పెద్దపల్లి: నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road accidents) ఇద్దరు మరణించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను భైంసా దవాఖానకు తరలించారు. మృతిచెందిన బాలుడిన ఆదిత్యగా గుర్తించారు. షిర్డీ (Shirdi) నుంచి భైంసా తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఇక మరో ఘటనలో పెద్దపల్లి (Peddapalli) పట్టణంలోని రింగంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపువెళ్తున్న లారీ.. రంగంపల్లి వద్ద రోడ్డుకు పక్కన ఆగి ఉన్నది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్వెళ్తున్న ఓ వ్యక్తి లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించాఉ. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.