హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో 65వ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. దీంతో లక్ష్మీ అనే నర్సు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రగాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం జాతీయ రహదారిపై ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అతనిది మహబూబాద్ జిల్లా గూడూరు మండలం సీతనగరానికి చెందిన లెక్కల సురేష్ రెడ్డిగా గుర్తించారు. రెండు ఘటనలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.