ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ (Neradigonda) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్తి బ్రిడ్జిపై బుధవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను సిరికొండ మండలం సుంకిడికి చెందిన జాదవ్ కిషన్, రాథోడ్ సుభాష్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.