జనగామ: జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఒకరిని హనుమకొండకు (Hanamkonda) చెందిన రాకేశ్గా గుర్తించారు. మరో వ్యక్తికి చెందిన వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.