హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులో నుంచి వెళికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.