జగిత్యాల : పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మేడిపల్లి , రాయికల్ మండలాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్కు చెందిన జాదవ్ జయరాం, జాదవ్ పుండలిక్లు సంవత్సరం కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని వెల్లడించారు. తమ గాలింపులో జాదవ్ జయరాం, జాదవ్ పుండలిక్ అనుమానంగా సంచరిస్తుండడంతో పట్టుకుని విచారించగా జగిత్యాల జిల్లాలో 15 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు.
వీరు ఆయా ప్రాంతాల నుంచి 845 గ్రాముల బంగారం,1580గ్రాముల వెండి, రూ.2. 69 లక్షల నగదును దోచుకెళ్లారని, దొంగిలించిన వస్తువులను నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన అవుసల వర్ధన్ అనే వ్యక్తి కొనుగోలు చేయగా అతన్నికూడా అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.