హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో జేఈఈ మెయిన్ను నిర్వహించవద్దని విద్యార్థులు ట్వి ట్టర్లో పోరాటానికి తెరలేపారు.
సిలబస్, కోచింగ్ పూ ర్తికాలేదని, జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉన్న నేపథ్యం లో జేఈఈ మెయిన్ నిర్వహించవద్దని కోరుతున్నారు. జేఈఈ మెయిన్ తొలి సెషన్ను ఏప్రిల్లో నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. #jeema ininapril హ్యాష్ట్యాగ్ పేరుతో ట్విట్టర్లో క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, ఎన్టీఏకు ట్యాగ్చేసి తమ వినతులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.