Warangal | వరంగల్ : ఆ కవల అమ్మాయిలు( Twin Sisters ).. సరిగ్గా ఏడాది క్రితం ఒకే వేదికపై వివాహం( Marriage ) చేసుకున్నారు. యాధృచ్చికంగా మళ్లీ ఒకే రోజు ఇద్దరు మగ బిడ్డలకు( Male Childrens ) జన్మనిచ్చారు. దీంతో ఆ కవలల భర్తలు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
నర్సంపేట( Narsampet ) నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య-కొంరమ్మలకు ఇద్దరు కవల అమ్మాయిలు. వారికి గతేడాది ఒకే వేదికపై వివాహం జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అమ్మాయిల పెళ్లికి అందించే కల్యాణలక్ష్మి( kalyanalakshmi ) చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి( MLA Peddi Sudarshan Reddy ) చేతుల మీదుగా వారు అందుకున్నారు.
సరిగ్గా ఏడాది కాలం తర్వాత నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి( Narsampet CHC )లో ఆ కవలలు ఒకే రోజు ప్రసవించి, మగ బిడ్డలకు జన్మనిచ్చారు. దీంతో నర్సంపేట ఎమ్మెల్యే శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపి కేసీఆర్ కిట్ల( KCR KIT )ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పేదింటికి ఆడపిల్ల భారం కాకుండా పుట్టిన నాటి నుంచి పెళ్లికి, కాన్పులకు ప్రభుత్వమే అండగా ఉండి కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అందిస్తూ ఆదుకుంటోందన్నారు.