నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి.
కుటుంబ తగాదాల విషయంలో కన్న తండ్రిని, బాబాయిని సతీష్ అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేసే పారతో తలపై మోది హతమార్చాడు. మృతులు కర్రోళ్ల అబ్బయ్య, కర్రోళ్ల నడిపి సాయిలుగా గుర్తించారు. కాగా, నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాలే హత్యకు దారితీశాయని పోలీసులు చెబుతున్నారు.
అయితే నిందితుడికి రెండేళ్ల నుంచి మానసిక స్థితి సరిగాలేదని గ్రామస్తులు అంటున్నారు. అబ్బయ్య, సాయిలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.