హైకోర్టులో ఈడీ వ్యాజ్యం దాఖలు
హైదరాబాద్, మార్చి 10 : టీవీ9 చానల్ మాజీ సీఈవో వీ రవిప్రకాశ్కు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. రూ.18 కోట్ల నిధుల దుర్వినియోగం కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర్ నుంచి గత ఫిబ్రవరి మధ్యకాలంలో నాలుగుసార్లు సమన్లు జారీచేసినా ఒకసారి కూడా రవిప్రకాశ్ విచారణకు రాలేదని తెలిపింది. 2020, 2021లో హైకోర్టు జారీచేసిన ముందస్తు బెయిల్ షరతులను రవిప్రకాశ్ ఉల్లంఘించినందున బెయిల్ద్ద్రు చేయాలని ఈడీ కోరింది. ఈ రిట్పై గురువారం జస్టిస్ లలిత విచారణ చేపట్టారు. చివరి శుక్రవారం ఈడీ ఎదుట హాజరుకావాలన్న హైకోర్టు బెయిల్ షరతులను కూడా రవిప్రకాశ్ అమలు చేయలేదని ఈడీ తరఫు న్యాయవాది పీ దేవేందర్రెడ్డి తెలిపారు. ప్రతివాదులైన రవిప్రకాశ్, ఎంకేవీఎన్ మూర్తికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది