ఖలీల్వాడి, ఫిబ్రవరి 14 : పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా ఎంపీ అర్వింద్ ఎటువంటి చర్యలు తీసుకోలేద ని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర లేక పసుపు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన చెందారు. మార్కెట్ యార్డులో సైతం పసుపు కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లను వేగిరం చేసి పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డు కార్యదర్శి విజయ్కిశోర్ మాట్లాడుతూ.. మార్కెట్కు పసుపు పంట అధికంగా వచ్చిందని అన్నారు. రైతులు ఇప్పుడే పంటను తీసుకురావొద్దని, యార్డులో ఉన్న పంట కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే తీసుకురావాలని సూచించారు.