సొంతంగా, నియోజకవర్గం తరఫున 1.58 కిలోల బంగారం సమర్పణ
యాదాద్రి, మార్చి 14 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ భారీ విరాళం సమర్పించారు. ఎమ్మెల్యే కుటుంబం తరఫున 250 గ్రాములు, నియోజకవర్గం తరఫున 1,330 గ్రాములు.. మొత్తం కిలో 580 గ్రాముల బంగారాన్ని సోమవారం యాదాద్రిలో ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈయన వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక దంపతులు తదితరులు ఉన్నారు.