జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడుగులు ఉంది. 105.788 టీఎంసీల నీటి నిల్వకు గాను 58.212 ఉంది. ప్రస్తుతం టీబీలోకి 59,757 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.