అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం ఇన్ఫ్లో 6 వేల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10,614 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 100.086 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1632.80 అడుగులకు చేరినట్లు బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్కు స్థిరంగా..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 13,797 క్యూసెక్కులుగా ఉండగా 13,350 క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తున్నదని ఆనకట్ట ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 9.3 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 447 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.