డిచ్పల్లి, ఆగస్టు 16: దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపనున్నాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ డీ రవీందర్గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోగల టీయూలోని సెమినార్ హాలులో తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిశోధన అధ్యయన కేంద్రం ఆధ్వర్యం లో ‘దళితబంధు-ప్రగతిపథం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీసీ రవీందర్గుప్తా మాట్లాడుతూ.. ఏ వర్గమైనా ఆర్థిక ఎదుగుదలతోనే ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటుందన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే జీవన ప్రమాణాలు పెంపొందించుకోగలుగుతామని తెలిపారు. హుజూరాబాద్ తర్వాత నిజామాబాద్లో కూడా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా టీయూలోని దళిత విద్యార్థులకు పరిశోధనా వనరులు అందించే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరా రు.
నానో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామిం గ్ సైన్స్ వంటి అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో దళిత పరిశోధకులు దళితబంధు వనరుల ద్వారా లబ్ధిపొందే అవకాశం ఉంటుందని వివరించా రు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య పీ కనకయ్య మాట్లాడుతూ.. దళితుల ఆర్థిక ఆత్మగౌరవానికి ప్రతీకగా దళిత బంధును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ పీ సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.