హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషికేశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రమోషన్లను కల్పించకుండా రిక్రూట్మెంట్ చేపడితే సీనియర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు కొత్తవారి కంటే జూనియర్లుగా మారే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా గురుకులాల్లో బదిలీలు చేపట్టలేదని, దీంతో ఏండ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో అనేక మంది సీనియర్లు పనిచేస్తున్నారని, వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెరుగైన ప్రాంతాలను కోల్పోతారని తెలిపారు.