తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను (Special Darshan tickets) శనివారం విడుదల చేయనుంది. శనివారం ఉదయం రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా వసతి గడుల కోటాను ఆదివారం విడుదల చేస్తుంది.
ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఆర్జిత సేవా టికెట్లు, 23న అంగప్రదక్షిణం టికెట్ల కోటాను విడుదల చేసింది. జూన్ 24 నుంచి 26 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.