హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ అలీ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్లో మృతిచెందారు. జూన్ 8న కుమార్తె పెండ్లి జరగాల్సి ఉండగా వస్ర్తాలు, ఆభరణాల షాపింగ్ చేస్తూ కూకట్పల్లిలోని ఓ ఆభరణాల దుకాణంలో కుప్పకులారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, మస్తాన్రావు దవాఖానకు వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.