హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులను ట్రాన్స్ కో శాఖ అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు. మూసీ నది, చెరువుల ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నారు. మూసీలో, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగి ముంపు ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
వర్షాల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు భద్రతా చర్యలు పాటించాలి. విద్యుత్కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు.. 7382072104, 7382072106, 7382071574.