TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆర్టీసీ కొత్త ప్రయాణాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఏసీ బస్సులు లేవు. నాన్-ఏసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 10 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కొత్తగా 85 బస్సులను ప్రవేశపెట్టనుంది. 75 ఎక్స్ప్రెస్ బస్సులు, 10 ఏసీ బస్సులు శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.