TS RTC | తమిళనాడులోని ప్రముఖ అరుణాచలంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు టీఆర్ఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇంతకు జులై 3న తొలిసారిగా గురు పౌర్ణమి సందర్భంగా తొలిసారిగా ప్రత్యేక సర్వీసులకు మంచి స్పందన రావడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రతిపౌర్ణమికి పది రోజుల ముందుగా ఆన్లైన్లో టికెట్ల అందుబాటులో ఉంటాయని, భక్తులు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది.
ఆయా జిల్లాల నుంచి బయలుదేరి బస్సులు గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందుగానే భక్తులను అరుణాచలానికి తరలించనున్నది. ఏపీలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దర్శనం అనంతరం అరుణగిరికి బస్సులు చేరుకోనున్నాయి. ప్రదక్షిణ పూర్తయ్యాక తిరిగి అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వద్దకు చేరుకుంటాయి. అక్కడ దర్శనాల అనంతరం ఆయా ప్రాంతాలకు బస్సులు తిరుగు ప్రయాణమవుతాయి. ఇంతకు ముందు అరుణచలానికి ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సును నడుపగా.. మంచి స్పందన వచ్చింది.
దాంతో 32 బస్సుల్లో భక్తులను అరుణగిరి ప్రదక్షిణకు తీసుకువెళ్లి.. సురక్షితంగా తిరిగి స్వస్థలాలకు చేర్చారు. భక్తుల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌర్ణమి బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే వారు పది రోజుల ముందుగా tsrtconline.in వెబ్సైట్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని టీఆర్ఎస్ చైర్మన్ బాజిరెడ్డి, చైర్మన్ వీసీ సజ్జనార్ సూచించారు. వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని కోరారు.