శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి 390 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఈ బస్సు సర్వీసులు ఈ నెల 16 నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కెపీహెచ్బీ, బీహెచ్ఈఎల్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 16న 36 ప్రత్యేక బస్సులు, 17న 99బస్సులు, 18న 99బస్సులు, 19న 88 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలంకు సూపర్ లగ్జరీలో వెళ్లేందుకు ఒకరికి రూ.600.. డీలక్స్ కు రూ.540, ఎక్స్ప్రెస్ కు రూ.460లు టికెట్ చార్జీలుండగా.. హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీలో వెళ్లేవారికి ఒక్కొక్కరికి రూ.650లు, డీలక్స్లో రూ.580, ఎక్స్ ప్రెస్లో రూ.500 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించారు.
సలహాలు, సూచనలకు.. ఎంజీబీఎస్ లో 9959226250, 9959226248, 9959226257 ఫోన్ నెంబర్లకు, జేబీఎస్ లో 9959226246, 040-27802203, ఐ.ఎస్.సదన్ లో 9959226250, బీ.హెచ్.ఈల్, కే.పీ.హెచ్.బీ ప్రాంతాల్లో 9959226149 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.