హైదరాబాద్ : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం వచ్చే శనివారం, ఆదివారాలలో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి నాన్-ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు గురువారం ఆర్టీసీ సికింద్రాబాద్ ఆర్ఎం సీహెచ్ వెంకన్న తెలిపారు.
ఈ క్రమంలో ఎంజీబీఎస్ నుంచి ఉదయం 5 గంటలకు, జేబీఎస్ నుంచి ఉదయం 5.30 గంటలకు ప్రత్యేక బస్సులు బయలు దేరుతాయన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఈ సౌకర్యాన్ని ఎక్కువ సంఖ్యలో వినియోగించుకోవాలని ఆర్ఎం కోరారు. టిక్కెట్ ధరల విషయానికొస్తే.. పెద్దలకు రూ.1099, పిల్లలకు 599 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు. టిక్కెట్లు ఇతర వివరాల కోసం టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ అధికారిక వెబ్సైట్తో పాటు 7382842582 ఫోన్ నంబర్కు సంప్రదించాలని ఆర్ఎం తెలిపారు.
-ఉదయం 7 గంటలకు తూప్రాన్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు.
-ఉదయం 10 నుంచి 11 వరకు పొచంపాడులోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు సందర్శన.
-మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 వరకు పొచ్చెర వాటర్ ఫాల్స్ సందర్శన.
-మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కుంటాల జలపాతం సందర్శన.
-రాత్రి 6 గంటలకు నిర్మల్ టాయ్, టాయ్స్ సందర్శన.
-తిరిగి రాత్రి 10.45 గంటలకు ఎంజీబీఎస్లో డ్రాపింగ్.