హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈనెల 13న తెలంగాణ, ఏపీల్లో ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వెయ్యి అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో స్థిరపడిన వారు సొంతూరికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో ఆర్టీసీ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక రోజూ నడిపే 3,450 బస్సులకు అదనంగా వెయ్యికిపైగా బస్సులను సిద్ధంగా ఉంచినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.