హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. ఆర్టీసీ మహిళా అధికారుల సమక్షంలో ప్రతి రీజియన్కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ప్రకటించారు. రీజియన్కు రూ.50 వేల చొప్పన రూ.5.50 లక్షలను సంస్థ కేటాయించింది. ఒకో రీజియన్లో ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేలు ఇవ్వనున్నారు.
రాఖీపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు 30, 31 తేదీల్లో సంస్థ ప్రకటించిన లకీడ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్ల్లో టికెట్ వెనుకాల పేరు, మొబైల్ నంబర్ను రాసి వేశారు. ఈ లకీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న ఘనంగా సతరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించనున్నది.